varadhinews.com

మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. బాల నటుడిగా పలు సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న మహేష్ అనతికాలంలోనే స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సూపర్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. మహేష్ బాబు సినిమాలతో పాటు పలు సేవాకార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. దాదాపు 1200 మంది పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి కుటుంబంలో వెలుగులు నింపాడు. మహేష్ బాబును టాలీవుడ్ అందగాడు అని పిలుస్తూ ఉంటారు. చూడటాన్ని హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని మహేశ్ బాబు 1975 ఆగస్టు 9న జన్మించారు. ఈయన ప్రఖ్యాత నటుడు కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. సూపర్‌ హిట్ సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు గౌతమ్‌, సితార అనే ఇద్దరు పిల్లలున్నారు.

మహేష్ బాబుతో స్పోర్ట్స్ డ్రామా.. వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వారణాసి ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నా వారణాసి సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది. దుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై డా.కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంక మందాకినీ పాత్రలో నటిస్తుంది. అలాగే కుంభ అనే నెగిటివ్ పాత్రలో పృథ్వీరాజ్కనిపించనున్నారు. అలాగే వారణాసి సినిమాలో మహేష్ బాబు రెండు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే రాముడిగా మహేష్ బాబు కనిపించనున్నాడని రాజమౌళి హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేస్తున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగ ఉన్నారు. యానిమల్ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో సందీప్ సినిమా చేయాలని అనుకున్నారు. ఇదే విషయాన్నీ ఆయన పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పారు. దాంతో వారణాసి సినిమా తర్వాత సందీప్ సినిమా ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. అలాగే సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి అనిల్ తో మహేష్ సినిమా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. మరి ఈవార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.