varadhinews.com

ఏపీ వెదర్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్..!

తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో జూన్ 20 (శనివారం) ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగవచ్చని అధికారులు హెచ్చరించారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రేపు (శనివారం) అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మరోవైపు కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం (20-06-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి అత్యధికంగా అనంతపురం జిల్లా సిద్దరాంపురంలో 61మిమీ వర్షపాతం నమోదయ్యింది.  శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 36మిమీ, వైఎస్సార్ కడప జిల్లా చౌడూరులో 31మిమీ, శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టిలో 29.9మిమీ, విజయనగరం జిల్లా గుర్లలో 28.2మిమీ, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి 26.5మిమీ, కోటబొమ్మాళిలో 26.2మిమీ, లావేరులో 22.5మిమీ, కర్నూలు జిల్లా తోవిలో 22మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్.. ఉచిత దర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు..

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఎస్‌డీ ఉచిత దర్శన టోకెన్ల జారీ సమయాలను మార్చింది. మొన్నటివరకు వేసవి రద్దీ కారణంగా ఉదయం 4 లేదా 5 గంటల సమయంలో టికెట్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు రద్దీ తగ్గడంతో సమయంలో మార్పులు చేశారు. Tirumala Darshan తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ జారీ చేసే ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు చేసింది. స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను(ఎస్‌ఎస్‌డీ) ప్రతీ రోజూ తిరుపతిలో టీటీడీ జారీ చేస్తోంది. ఈ టోకెన్లు జారీ చేసే సమయాల్లో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉదయం 5 గంటలకు వీటిని అందిస్తున్నారు. అయితే ఇక నుంచి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. శుక్రవారం నుంచే ఈ సమయాల్లో మార్పులు చేశారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులకు తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో ఎస్‌ఎస్‌డీ దర్శన టికెట్లను అందిస్తోంది. రైల్వే స్టేషన్ పక్కన ఉండే విష్ణునివాసం, బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి మెట్ల దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టోకెట్లను అందిస్తున్నారు. రోజుకు 15 వేల టోకెన్ల వరకు జారీ చేస్తున్నారు. సమయంలో మార్పులు.. కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లేవారి కోసం మరో 2 వేల టోకెన్లను అందిస్తున్నారు. ఓరిజినల్ ఆధార్ లేదా ఆధార్ కార్డు జిరాక్స్ అందిస్తే మీ ఫొటో తీసుకుని ఈ దర్శనం టోకెన్ ఉచితంగా అందిస్తారు. అయితే రెండు, మూడు గంటల పాటు క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొన్నటివరకు వేసవి రద్దీ కారణంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఉదయం 4 లేదా 5 గంటల సమయంలో జారీ చేశారు. ఇప్పుడు స్కూళ్లు ప్రారంభం కావడం, వేసవి సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ తగ్గింది. దీంతో టికెట్లు అందించే సమయాల్లో మార్పులు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవాలు అటు జూన్ 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పో్త్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను టీటీడీ జేఈవో శరత్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా విద్యుత్, త్రాగునీరు, దర్శన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. తెప్పల ఫిట్‌నెస్ పరిశీలించేలా ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. విద్యుత్, పుష్పాల అలంకరణలతో తెప్పలను తీర్చిద్దాలని తెలిపారు. ఇక కోలాటాలు, సంగీత కచేరీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.